”నాకు ‘ఖైది’ ఎలానో చరణ్కి ‘రంగస్థలం’ అలా. తన ఇమేజ్ పెంచే సినిమా అవుతుంది. నటుడిగా మరో మెట్టు ఎక్కించేలా ఉంటుంది. ఇంత మంచి పాత్ర చరణ్కి దక్కినందుకు నటుడిగా ఈర్ష్య పడుతున్నా, తండ్రిగా గర్వంగానూ ఉంది”అన్నారు చిరంజీవి
రామ్చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సమంత నాయిక. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. సుకుమార్ దర్శకుడు. ఈనెల 30న విడుదల కాబోతోంది. నిన్న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ రంగస్థలం’ స్వచ్ఛమైన గ్రామీణ కథ ఇది. సినిమా చూశా. పల్లెవాతావరణాన్ని, మనస్తత్వాన్ని, అక్కడి రాజకీయాల్ని చక్కగా చూపించాడు. నాకు ‘ఖైది’ ఎలానో చరణ్కి ‘రంగస్థలం’ అలా. తన ఇమేజ్ పెంచే సినిమా అవుతుంది. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ… సుకుమారే. ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు,అభినందనలు” అన్నారు మెగాస్టార్.