Site icon TeluguMirchi.com

మురళీమోహన్‌ ను పరామర్శించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు శనివారం సీనియర్ నటుడు మురళీమోహన్‌ను పరామర్శించారు. రీసెంట్ గా మురళీమోహన్ ఓ ప్రముఖ ఆస్పత్రిలో వెన్నుముక ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి సతీసమేతంగా వెళ్లి మురళీమోహన్‌ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మధ్యనే తన తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అస్థికలు గంగలో కలిపేందుకు అలహాబాద్, వారణాసి వెళ్లిన మురళీమోహన్ అక్కడ అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆయన వెన్నుముకలో సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో మురళీమోహన్ అంగీకరించి సర్జరీ చేయించుకున్నారు.

Exit mobile version