చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకొన్నాడు. అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు. ఇటీవల మహబూబ్నగర్ బస్సు ప్రమాదంలో వెంకటేష్ అనే చిరు అభిమాని చనిపోయాడు. అతను కర్నాటక చిరంజీవి అభిమాన సంఘూనికి అధ్యక్షుడు. వ్యక్తిగతంగా చిరంజీవితో మంచి సంబంధాలు కూడా ఉండేవి. చిరు ఇంట్లో శుభకార్యాలు జరిగితే.. వెంకటేష్ కి ప్రత్యేక ఆహ్వానం అందేది. అలాగే వెంటటేష్ కూడా తన ఇంట్లో జరిగే వేడుకలకు చిరు కుటుంబాన్ని ఆహ్వానించేవాడు. అలాంటి వెంకటేష్ హఠాన్మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. దాంతో చిరు.. తన వంతు సాహయంగా రూ.5 లక్షలు అందించారు. ఈమొత్తాన్ని నాగబాబు వెంకటేష్ కుటుంబ సభ్యులకు అందించారు.