చిరంజీవి – వి.వి.వినాయక్ కాంబినేషన్ లో చిరు 150 వ చిత్రంగా ‘ఖైధీ నెం 150’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెల్సిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసుకోవడం తో చిత్ర బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో చిత్ర రైట్స్ అమ్మకాలు జరిగాయని సమాచారం. తాజాగా ఆంధ్ర కు సంబంధించిన రైట్స్ రూ. 32 కోట్లకు అమ్ముడైనట్టు వినికిడి.
‘బాహుబలి’ చిత్ర ఆంద్ర హక్కులతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో ‘బాహుబలి’ ఆంధ్రా హక్కులు రూ. 30 కోట్ల ధర కు అమ్ముడుపోయాయని సమాచారం. చాల గ్యాప్ తర్వాత చిరంజీవి వెండి తెర ఫై కనిపించడం తో ఈ సినిమా ఫై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యం లో కొనుగులుదారులు ఎంత ఎమౌంట్ పెట్టడానికైనా వెనుకడుగు వెయ్యడం లేదు.