తనయుడు సినిమా వేడుక అంటే ఎక్కడున్నా ప్రత్యక్షమైపోతారు చిరంజీవి. పైగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా, క్లాసిక్ జంజీర్కి రీమేక్ – బాలీవుడ్ ప్రముఖులొస్తారని తెలుసు. అయినా తుఫాన్ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి డుమ్మా కొట్టాడు. బాలీవుడ్ జనాల ముందు తన స్టామినాను, అభిమాన గణాన్ని చూపించుకోవడానికి చరణ్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ ఇది. చిరంజీవి కూడా తప్పకుండా వస్తాడు అని అభిమానులు ఆశించారు. కానీ ఆయన రాలేదు. కారణం ఒక్కటే – ఓ పక్క ఆంధ్రా, రాయలసీమ భగభగ మండిపోతోంది. జనాలు రోడ్డు మీదకు వచ్చారు. ఉద్యోగాలు మానేశారు. ఈ పరిస్థితిలో వారిని తప్పించుకొని తిరుగుతున్న చిరంజీవి – ఆడియో విడుదల ఫంక్షన్లలో పాల్గొంటే, ఆంధ్రాలో ఆయన ఇమేజ్ మరింత డామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే కావాలనే, ఈ కార్యక్రమానికి చిరంజీవి దూరంగా ఉన్నారు. చిరు లేకపోవడం, పెద్ద స్టార్లెవరూ కనిపించకపోవడంతో తుఫాన్ వేడుక చప్పగా సాగిపోయింది. సినిమా అయినా కిక్ ఇస్తుందో లేదో…?