మళ్లీ రామ్చరణ్ – మహేష్బాబు బాక్సాఫీసు దగ్గర పోటీ పడబోతున్నారు….
వీరిద్దరి సినిమా ఒకే రోజు అంటే సెప్టెంబరు 26న విడుదల కాబోతోంది…
ఈసారి ఎవరు గెలుస్తారో, ఏంటో…?
ఇలా రకరకాల ఊహాగానాలు టాలీవుడ్లో వ్యాపించాయి. వీటిలో నిజమెంతోగానీ టాలీవుడ్లో మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వీరిద్దరూ ఇప్పటికి రెండు సార్లు బాక్సాఫీసు దగ్గర పోటీ పడ్డాడు. ఆ రెండుసార్లూ చరణ్ హిట్ కొట్టాడు. మహేష్కి ఒక్కసారి మాత్రమే విజయం వరించింది. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోవిందుడు అందరివాడేలే షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఈ సినిమా ఆగిపోయింది. కృష్ణవంశీ తీత నచ్చకపోవడం వల్లే గోవిండుదు సినిమాని చిరంజీవి ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గోవిందుడు సినిమాపై నెగిటీవ్ ప్రచారం మొదలైంది. పైగా ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. మాస్ త్వరగా కనెక్ట్ అయ్యే ఛాన్సులు తక్కువ. ఆగడు అలా కాదు. అదో వినోదాల విందు భోజనం. దానికి తోడు మహేష్ బాబు – శ్రీనువైట్ల కలయిక అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. దూకుడుతో తామేంటో నిరూపించుకొన్నారు. ఈసారీ అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో….. సంక్రాంతి సీజన్లో చరణ్ చేతిలో ఓడిన మహేష్… ఈసారి కచ్చితంగా పైచేయి సాధించే అవకాశాలున్నాయని ఫిల్మ్నగర్ వాసులు చెప్పుకొంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆగడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు తక్కువేనట. ఎందుకంటే గోవిండుదుడు…. ఆగిపోయింది కదా? అది మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. సో.. ఈసారి మహేష్ సోలోగా రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ వచ్చినా సీన్ రివర్స్ అయ్యే సూచనలే ఎక్కువు ఉన్నాయి. ఒకవేళ 2013లో నాయక్, సీతమ్మ వాకిట్లో… రెండూ విజయాలు సాధించేసినట్టు – ఆగడు, గోవిందుడు అందరి వాడేలే రెండూ హిట్స్ కొట్టేస్తే.. అంతకంటే కావల్సిందేముంది?