ఈయేడాది సంక్రాంతికి మహేష్బాబు – రామ్చరణ్ బాక్సాఫీసు దగ్గర పోటీ పడ్డారు. మహేష్ 1 – నేనొక్కడినే అంటూ బాక్సాఫీసు రంగంలోకి దిగితే… రామ్చరణ్ `ఎవడు` అంటూ అతన్ని ఢీ కొట్టాడు. ఈ పోటీలో చరణ్ గెలిచాడు. వసూళ్లలో, విమర్శకుల ప్రసంశల్లో ఎవడుకే ఎక్కువ మార్కులొచ్చాయి. ఇప్పుడు మళ్లీ…. చరణ్ ప్రిన్స్ని ఓడించేశాడు. ఈసారి వెండి తెరపై కాదు. బుల్లి తెరపై. ఎవడు, నేనొక్కడినే సినిమాలు రెండూ ఒకేరోజు బుల్లితెరలో టెలికాస్ట్ అయ్యాయి. ఎవడు మాటీవీలో ప్రసారం అయితే, వన్ జెమినీలో టెలీకాస్ట్ అయ్యింది. ఈసారీ చరణ్ సినిమాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. బుల్లి తెర వీక్షకులు చరణ్సినిమా చూడ్డానికికే ఆసక్తి చూపించారు. అందుకే రేటింగుల్లోనూ ఎవడుకి ఫస్ట్ ప్లేస్ దక్కింది. ఎవడుకి 10 రేటింగ్ వస్తే… వన్ సినిమా 7తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బుల్లి తెర ప్రేక్షకులు కూడా మాస్ మసాలా సినిమాలకే ఓటు వేస్తారని మరోసారి స్పష్టమైంది.