Site icon TeluguMirchi.com

ఛార్మీ.. ఫ్రీ.. ప్రతిఘ(న)టన!

prathigatana4ఛార్మీ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ’ప్రతిఘటన’. ఢిల్లీ నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మ్తాత తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఛార్మీ ’ఫ్రీ’గా నటిస్తోందట. సంగీత దర్శకుడు కీరవాణీ, చాయాగ్రాహకుడు యస్. గోపాల్ రెడ్డి లు కూడా ఎలాంటి పారితోషాకాన్ని తీసుకోలేదట. సామాజిక సృహ కలిగిన కథాంశం కావడం వల్ల ఫ్రీ గా చేయడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తమ్మారెడ్డి వెల్లడించారు. తాజాగా..  ఈ చిత్రంలోని.. చిత్రాలను రిలీజ్ చేశారు. అన్నట్టు.. ’ఛార్మీ’లాగా మరికొందరు ముందుగుమ్మలు ముందుకొస్తే.. మరిన్ని మంచి సినిమాలు మన ముందుకొస్తాయేమో…..

Exit mobile version