Site icon TeluguMirchi.com

ఆర్.ఎఫ్.సిలో చరణ్ యాక్షన్ !

ramcharnమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఎవడు’. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుపుకొంటోది. ఇందులో బాగంగా ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాలో సుమారు 10నిముషాలు పాటు సాగుతోందని యూనిట్ చెబుతోంది. ‘ఎవడు’ చిత్రంలో బన్నీ, కాజల్ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇటివలే వీరి ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా జరిగింది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మే 9వ తేదీన విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘ఎవడు’ చిత్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాయిస్ ఓవర్ రెగ్యులర్ గా కాకుండా చాల డిఫరెంట్ గా ఉంటుందట.

Exit mobile version