ఎవడు సినిమాకి సినిమా కష్టాలు పట్టుకొన్నాయి. సినిమా ఎప్పుడో పూర్తయింది. అనుకొన్న సమయానికి విడుదల చేసి ఉంటే, ఈపాటికి టీవీల్లోనూ చూసేద్దుము. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ… వచ్చేస్తాం, వచ్చేస్తాం అని మాట ఇస్తూ ఆ మాటని నిలబెట్టుకోలేకపోతోంది చిత్రబృందం. డిసెంబరు 19న ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేస్తాం అని చెప్పిన దిల్ రాజు యధావిధిగా తన సినిమాని మళ్లీ వాయిదా వేశాడు. ఈ సినిమా ఇప్పుడు జనవరికి జంప్ అయ్యింది. డిసెంబరు సినిమాలకు మంచి సీజన్ కాదని, వసూళ్లు రాబట్టుకోవడం కష్టమని దిల్రాజు భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాని పోటీ కాస్త ఎక్కువైనా సరే, సంక్రాంతికే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకొన్నారని తెలిసింది. అనుకొన్న సమయానికికే ఈ సినిమా తీసుకొస్తాం.. అని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న దిల్ రాజు రేపో మాపో మరో వాయిదా ప్రకటన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి మెగా అభిమానులు మరోసారి డీలా పడిపోయారు. ఎవడుకి కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయే ఏంటో..?