బాహుబలి ని తలదన్నే సినిమా చేస్తాడట.

తెలుగు సినిమా అంటే ఇదిరా..అని ప్రపంచ వ్యాప్తంగా అనుకునేలా బాహుబలి సినిమా ను తెరకెక్కించి రాజమౌళి మన తెలుగు సినిమా కు గౌరవం తెచ్చాడు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో బాహుబలి వసూళ్లు రాబట్టడం చూసి అందరూ షాక్ అవుతున్నారు..ఈ షాక్ లో వారు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేయడగా , తమిళ దర్శకుడు చేరన్‌ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

‘బాహుబలి2’ని మించిన సినిమాను తమిళంలోనూ తీయాలని, అందుకు తగ్గ పౌరాణిక కథలు ఎన్నో ఉన్నాయంటూ చేరన్‌ ట్వీట్‌ చేసి కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ‘బాహుబలి2’ సాధిస్తున్న కలెక్షన్లకు నిర్మాతలు, పంపిణీదారులు జేబులు నింపుకుంటుంటే, దర్శకుల్లో మాత్రం బాహుబలి సత్తాను జీర్ణించుకోలేక పోతున్నారు.