పూరిలో మార్పు వచ్చిందా ?

తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘మెహబూబా’. శుక్రవారం ఉదయం టీజర్ విడుదల చేశారు. రీసెంట్‌గా రొటీన్ క్యారెక్ట‌రైజేష‌న్‌ల‌తో పూరీ తీసిన సినిమాల కంటే టీజర్ బాగుంది. ఈయన గత సినిమాలతో పోలిస్తే… చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మేకింగ్, టేకింగ్‌లో కొత్తదనం కనిపించింది.

పూరి జగన్నాధ్ .. సూపర్ హిట్ డైరెక్టర్ . ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు. బాక్సాఫీసు బిజినెస్ మెన్. అయితే ఇప్పుడు పరిస్తితి బ్యాడ్ గా వుంది. గత కొంత కాలంగా ఆయన మ్యాజిక్ వర్క్ అవుట్ కావడం లేదు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం .. అంతకుముందు హార్ట్ ఎటాక్, ఇద్దరమ్మాయిలు.. ఇలా వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టేశాయి. కానీ ‘మెహబూబా’లో మాత్రం విషయం వున్నట్లు అనిపిస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలు చుట్టేస్తున్నాడని పూరిపై విమర్శ వుంది. కానీ ‘మెహబూబా’లో మాత్రం డెప్త్ కనిపిస్తుంది. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.