‘ఓం’ తో రామ్ రేంజ్ పెరుగుతోంది : చంద్రబాబు

cbn-kalyan-ramనందమూరి కళ్యాణ్ రామ్ ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. కల్యాణ్ రామ్ నటించి, నిర్మించిన త్రీడీ సినిమా ‘ఓం’ ను చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.. అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ’ఓం’ సినిమా ప్రాంతీయభాషల చిత్రసీమలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ’ఓం’ సినిమాతో కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతోందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించేందుకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందని, ఈ సినిమాను ప్రేక్షకులు అశీర్వదించి అభినందించాలని బాబు ఆకాంక్షించారు.