ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం చండీ. సముద్ర దర్శకుడు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలోని గీతాల్ని సోమవారం రాత్రి హైదరాబాద్లో విడుదల చేశారు. ప్రభాస్ వస్తాడు, విద్యాబాలన్ వస్తుంది అని ఊరించి ఊరించి – చివరికి బెల్లంకొండ సురేష్తో ఆడియో లాంచ్ చేయించారు. అయితే ప్రభాస్ రానిలోటుని కృష్ణంరాజు, విద్యాబాలన్ స్థానం ప్రియమణి భర్తీ చేశారు. ఈ వేదికపై ప్రియమణి, కృష్ణంరాజు ఇద్దరూ స్టెప్పులు వేశారు. ఈ చిత్రాన్నివిప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి అంకితం చేస్తున్నామని సముద్ర ప్రకటించారు. ప్రభాస్ని చూద్దామని వచ్చిన అభిమానులు ఉసూరుమంటూ నిష్ర్కమించారు.