వర్షాకాలంలో కలుసుకున్న మేము.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవికాలంలో విడిపోయాం’ అంటున్నాడు నితిన్. ‘లై’ సినిమా తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘చల్ మోహన్ రంగ’. ఈ టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లో ‘నీ కథేంటి భయ్యా’ అని ఓ వ్యక్తి నితిన్ అడగ్గా ‘వర్షాకాలంలో కలుసుకున్న మేము.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవికాలంలో విడిపోయాం’ అంటూ సమాధానం ఇస్తే.. ‘మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా భయ్యా’ అంటూ అవతలి వ్యక్తి అమాయకంగా ప్రశ్నించడం.. నితిన్ తిడుతూ కనిపించడం నవ్వులు పూయిస్తోంది.
నితిన్ నటిస్తున్న 25వ చిత్రమిది. కుటంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా దర్శకుడు కృష్ణ చైతన్య దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మూల కథను అందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.