Site icon TeluguMirchi.com

సక్సెస్‌ దర్శకుడితో మరోసారి జతకట్టనున్న చైతూ

అక్కినేని యువహీరో నాగచైతన్య వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. ఈయన ప్రస్తుతం కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలయ్యి అంచనాలను పెంచేస్తున్నాయి. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత చైతూ సక్సెస్‌ దర్శకుడితో మరోమారు జతకట్టనున్నాడు. ‘ఏమాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో చైతూకు మంచి విజయాలను అందించిన సక్సెస్‌ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించనున్నాడు.

తాజాగా మీడియాతో ముచ్చటించిన చైతూ మాటల మధ్యలో తాను మరోసారి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలిపాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కించడానికి గౌతమ్‌ మీనన్‌ సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగులో హీరోగా చైతూని ఎంపిక చేయగా ఇతర భాషల్లో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. చైతూ, గౌతమ్‌ మీనన్‌ కాంభో అనగానే అక్కినేని అభిమానులకు అంచనాలు నెలకొంటున్నాయి.

Exit mobile version