అశ్లీలంగా వుందని చరణ్ పై కేసు !

yevaduరామ్ చరణ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఎవడు’. ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ చాలా అశ్లీలంగా వున్నయని చరణ్ , ఎవడు టీం పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికేట్ Aనే అశ్లీలం, హింస కు నిదర్శనమని వారి వాదన.