Site icon TeluguMirchi.com

మహేష్ థియేటర్ లో మెగా హీరో సందడి..

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టిప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే . ఈ థియేటర్ ప్రారంభం అయినా దగ్గరి నుండి సినీ , రాజకీయ ప్రముఖులంతా సినిమాలను ఇక్కడే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవి నటించిన సైరా చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించారు.

ప్రస్తుతం సైరా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది సైరా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసి తెలుగు ఇండస్ట్రీ పెద్దలతో పాటు మిగిలిన ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

Exit mobile version