పూరి, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దిశా పఠాని ని వంశీ- బన్నీ లు ఒకే చేసారని తెలుస్తుంది. గతంలో ఈ సినిమా కోసం కన్నడ హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ఎమయిందో ఏమో కానీ బన్నీ కన్ను మాత్రం దిశా పైనే ఎక్కువగా ఉండడం తో ఆమెనే ఫిక్స్ అంటున్నారు చిత్ర వర్గాలు. ఇక ఈ మూవీ లో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించనున్నారు.