బన్నీ కన్ను ఆమెపై పడింది..

DJ-Firstlookస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ మూవీ తో బిజీ గా ఉన్నాడు..ఈ మూవీ తర్వాత స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం లో ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే మూవీ చేయబోతున్నాడు..ఇప్పటికే ఈ సినిమాకు సంబదించిన ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన డైరెక్టర్..తాజాగా ఈ మూవీ లో హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసాడని వినికిడి.

Bunny-disha
పూరి, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన దిశా పఠాని ని వంశీ- బన్నీ లు ఒకే చేసారని తెలుస్తుంది. గతంలో ఈ సినిమా కోసం కన్నడ హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. కానీ మళ్లీ ఎమయిందో ఏమో కానీ బన్నీ కన్ను మాత్రం దిశా పైనే ఎక్కువగా ఉండడం తో ఆమెనే ఫిక్స్ అంటున్నారు చిత్ర వర్గాలు. ఇక ఈ మూవీ లో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించనున్నారు.