దివంగత నటి శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో కలిపిన సంగతి తెలిసిందే. తాజాగా హరిద్వార్ లో కూడా హరిద్వార్లో కలిపారు. అయితే రెండు ప్రదేశాల్లో శ్రీదేవి అస్థికలు ఎందుకు కలిపారు అన్న విషయంపై బోనీ సన్నిహితులు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.
1993లో శ్రీదేవి ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా హరిద్వార్ వెళ్లారట. అయితే చిత్రీకరణలో బిజీగా ఉండి హరిద్వార్ను దర్శించుకోలేపోయారు. దాంతో మళ్లీ వస్తానని మొక్కుకున్నారట. ఇప్పటివరకు శ్రీదేవికి హరిద్వార్ వెళ్లే అవకాశం రాలేదు. అందుకే శ్రీదేవి కోరిక ప్రకారం ఆమె అస్థికలను హరిద్వార్లోని గంగా నదిలో కలిపినట్లు తెలిపారు. హరిద్వార్లో నిర్వహించిన కార్యక్రమానికి బోనీతో పాటు అనిల్కపూర్, కరణ్ జోహార్ వెళ్లారు.