అక్షయ్ కుమార్ , పరిణితీ చోప్రా జంటగా అనురాగ్ దర్శకత్వంలో 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కేసరి. ప్రస్తుతం ఈ చిత్రం మహారాష్ట్రలోని వాయ్లో షూటింగ్ జరుపుకుంటుంది. కొద్ది రోజులుగా అక్షయ్ కుమార్తో పాటు పలువురు నటీనటులతో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. రీసెంట్గా అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తి కావడంతో ఆయన ముంబై వెళ్ళారు. మిగతా యూనిట్ అంతా వాయ్లోనే ఉన్నారు.
సరాగర్హి యుద్ధంకి సంబంధించి సీన్స్ తెరకెక్కించే క్రమంలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ సీన్స్ ప్లాన్ చేశారు. అనుకోకుండా ఒక బాంబ్ భారీగా పేలడంతో సెట్ అంతా దగ్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకోనున్నారు. చారిత్రాత్మక చిత్రంగా రూపొందుతున్న కేసరి చిత్రం ఆగస్ట్లో విడుదల చేయాలనీ భావించారు. ఈ లోపు ఈ ప్రమాదం జరగడం, సెట్ పూర్తిగా దగ్ధం కావడం తో చిత్ర రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపిస్తున్నాడు. అక్షయ్, కరణ్ జోహార్ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తుండడం విశేషం.