Pallavi Prashanth : చంచల్ గూడ జైలుకు బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్.. 14 రోజులు రిమాండ్


బిగ్‌బాస్‌ సీజన్ సెవెన్ విజేతగా కామన్ మ్యాన్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచాడు. దీనితో తన విజయం ఒక సంచలనంగా మారింది. అయితే, పల్లవి ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన వందలాది మంది అభిమానులు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అంతేకాదు రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ తో పాటు, మరికొంత మంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఇక ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్టడంతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు ప్రశాంత్ మరియు అతడి సోదరుడు మనోహర్ పై A 1, A 2 కేసులు నమోదు చేసారు. ఆ కేసుకు సంబంధించి ప్రశాంత్ ని మరియు అతడి సోదరుడిని పోలీసులు బుధవారం నాడు కొల్లూరులో అరెస్ట్ చేసారు. వైద్య పరీక్షల అనంతరం వారిని నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టగా, వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ని విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీనితో పోలీసులు వారిద్దరిని చంచల్ గూడ జైలుకి తరలించారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.