తెలుగు చిత్రసీమ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి కోసం సర్వం సిద్దం అవుతోంది. రాజమౌళి ప్రస్తుతం భారీ సెట్ని తీర్చిదిద్దే పనులను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో మూడు కోట్లతో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. చిత్రంలోని సింహభాగం ఈ సెట్స్ లోనే తెరకెక్కిస్తారు. దాదాపు 30 శాతం సిజీ వర్క్ ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రానాలు కత్తియుద్ధం నేర్చుకొన్నారు. వాళ్లపై ట్రయల్ షూట్ కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అన్నట్టు ఈసినిమా బడ్జెట్ అంచనా దాదాపు రూ.80 కోట్లు. తెలుగు చిత్రసీమలో భారీ వ్యయంతో తెరకెక్కబోతున్న చిత్రమిదే అవుతుంది. బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్లోనూ అడుగుపెట్టబోతున్నారు.