సునీల్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఉదయ్ శంకర్ దర్శకుడు. ఎస్తర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి భీమవరం బుల్లోడు అనే టైటిల్ ఖరారు చేశారు. అంతకు ముందు దసరాబుల్లోడు అని పెడదాం అనుకొన్నారు. అయితే… ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకొన్నారు. భీమవరం బుల్లోడు ఫస్ట్ లుక్ని ఈరోజు విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తయింది. అనూప్ బాణీలు అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని త్వరలోనే విడుదల చేస్తారట. కలిసుందాం రా, బలాదూర్ చిత్రాల తరవాత ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించే సినిమా ఇదే! ఆ రెండూ సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కించాడు. ఇది ఆ సంస్థతో హ్యాట్రిక్ సినిమా! తడాఖాతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన సునీల్ సోలో హీరోగా ఈ సినిమాతో నిరూపించుకొంటాడేమో చూడాలి.