గ్రీకువీరుడు తరవాత.. నాగార్జున ‘భాయ్’పై దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కోసం మంగళవారం ఆయన ఐస్ లాండ్ పయనమవుతున్నారు. అక్కడ పాటల్ని తెరకెక్కిస్తారు. వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రిచా గంగోపాధ్యాయ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. హలో బ్రదర్ తరహాలో వినోదాన్ని, యాక్షన్ నీ మేళవించారు వీరభద్రమ్. ఐస్ లాండ్ షెడ్యూలుతో సినిమా దాదాపు పూర్తవుతుంది. మళ్లీ రాజధానిలో ఓ షెడ్యూల్ తీస్తారు. ఆగష్ట్ లో ఈసినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.