నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం బంగారు కోడి పెట్ట. గురు ఫిల్స్మ్ సంస్థ నిర్మిస్తోంది. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. చాల రోజుల క్రితమే చిత్రీకరణ పూర్తయింది. సమంత అతిధి గా పాటల వేడుక కూడా జరిగిచాల కాలం అయింది. అయితే కొన్ని కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఈ యాడాది లోని ఎలాగైనా ‘బంగారు కోడి పెట్ట’ ను దియేటర్లోకి తీసుకురావడాని చిత్ర టీం సన్నహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ జరిగింది. సెన్సార్ బోర్డు బంగారు కోడి పెట్టకు ‘యు/ఏ’ ను ఇచ్చింది. కోడి పుంజుని కిడ్నాప్ చేయడం, సినిమా అడిషన్స్, పేకాట టోర్నమెంట్ ఇలా చిత్రవిచిత్రమైన సన్నివేశాలతో సాగే సినిమా ఇది. మనిషి ఎన్ని అడ్డదార్లు తొక్కాలనుకొన్నా.. జీవితం అతన్ని తనదైన దారిలోనే నడిపిస్తుంది… అనే విషయంతో సాగే సినిమా ఇదని టీం చెబుతోంది. ఇక స్వామి రారాతో ఓ విజయాన్ని అందుకొన్న స్వాతి… ఈ సినిమాతో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి. నవదీప్ కు కూడా ఈ చిత్రం చాల కీలకం కానుంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తారు.