కట్టప్ప తగ్గడంతో ‘బాహుబలి’కి లైన్‌ క్లియర్‌

bahubali-telugu-poster-newటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గత ఐదేళ్లుగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రం ఈ నె 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి పార్టు విడుదలయ్యి జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ‘బాహుబలి’ రెండో పార్టు కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టులోని అనేక సందేహాలకు రెండో పార్టులో నివృత్తులు ఉన్నాయి. టీం అంతా కూడా రెండో పార్టు మొదటి పార్టు కంటే ఘన విజయం సాధిస్తుంది అని ధీమాగా ఉన్నారు. ఈ చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా కన్నడ భాషలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటాం అని ఇటీవలె కన్నడిగులు హెచ్చరించారు.

దాంతో చేసేది లేక రాజమౌళి కన్నడ భాషలో మాట్లాడి మరీ కన్నడ ‘బాహుబలి’ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన కట్టప్ప సత్యరాజ్‌ కూడా కన్నడిగులను ఒప్పించే ప్రయత్నం చేశాడు. గతంలో తాను కావేరి నదీ జలాల విషయంలో కన్నడ వారిని బాదపెట్టే విధంగా మాట్లాడానని, అందుకు క్షమాపణలు కూడా తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగానే ఉన్నాయని కట్టప్ప తన తప్పును ఒప్పుకున్నాడు. సత్యరాజ్‌ స్వయంగా సారీ చెప్పడంతో కన్నడలో ‘బాహుబలి’ విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కట్టప్ప వెనక్కు తగ్గి సారీ చెప్పడం వల్లనే కన్నడిగులు విడుదలకు ఒకే చెప్పారు. కన్నడలో కూడా ఇతర భాషలతో పాటే ఈ నెల 28 విడుదల కానుంది.