బాహుబలి 2 సెకన్ కు 12 టికెట్స్ అమ్ముడవుతున్నాయట..

బాహుబలి 2 విడుదలై అన్ని రికార్డ్స్ ను చెరిపివేస్తుంది..తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో ఎవరు ఊహించలేని వార్త ను బయటపెట్టి అభిమానులను ఆనందపరిచింది. ఇప్పటివరకు తాము దాదాపు 33 లక్షల టికెట్లు అమ్మినట్లు బుక్ మై షో తెలిపింది. ప్రతి సెకనుకు 12 టికెట్లు బుక్ అవుతున్నాయని, దాంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని సంస్థ తెలిపింది. బాహుబలి మొదటి పార్ట్ కంటే రెండో భాగానికి 350 శాతం ఎక్కువగా అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు చెప్పుకొచ్చింది.

సినిమా రిలీజ్ అయి నాల్గు రోజులు పూర్తయిన కానీ ఇంకా బాహుబలి ఆన్లైన్ టికెట్స్ హావ కొనసాగుతూనే ఉందని , ఇది కేవలం దక్షిణ భారతంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టికెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదని బుక్ మై షో చెప్పుకొచ్చింది.