మరో వారం లో బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం చిత్ర నటి నటులతో సినిమా ప్రమోషన్స్ కానిస్తూ సినిమా ఫై మరింత అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించిన రాజమౌళి..తాజాగా దుబాయి లో సందడి చేసాడు.
సిటీ వాక్లోని రాక్సీ సినిమాస్లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క పాల్గొననున్నారు. బాహుబలి చిత్రం బృందం దుబాయ్ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని డీసీటీసీఎం(దుబాయ్ కార్పొరేషన్ ఫర్టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) సీఈవో ఇస్సాం కాజిమ్ తెలిపారు. ఇలాంటి సినిమాలు దుబాయ్లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు.
ఏప్రిల్ 28 న కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో తెలియనుంది..ఇప్పటికే పలు ఆన్లైన్ సైట్స్ బాహుబలి 2 సంబదించిన టిక్కెస్ ఓపెన్ చేసారని తెలుస్తుంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్నా ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ తిరగరాస్తుందో చూడాలి.