బాహుబలి-2 విడుదలపై స్టేకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. బాహుబలి-2 తమిళనాడు పంపిణీదారు రూ.1.18 కోట్లు బకాయి ఉన్నాడంటూ ఏస్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఏస్ సంస్థ పిటిషన్పై శ్రీగ్రీన్ ప్రొడక్షన్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
ఇక సినిమా విషయానికి వస్తే తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చింది ‘బాహుబలి. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన చిత్రం ‘బాహుబలి కొనసాగింపుగా ఇప్పుడు బాహుబలి: ద కన్క్లూజన్ చూపించబోతున్నారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2పై కూడా భారీ అంచనాలు వున్నాయి. ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.