స్వతహాగా ఆమ్రాపాలి ప్రభాస్ అభిమాని అవ్వడంతో పాటు ‘బాహుబలి’ మొదటి పార్ట్ ఆమెకు విపరీతంగా నచ్చిందట. దాంతో ఆమె ఇప్పుడు రెండవ పార్ట్ను మొదటి రోజే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తనతో పాటు మిత్రులు, బంధువులు, తోటి ఆఫీసర్స్ అందరికి కూడా టికెట్లు తీసుకున్నారు. హన్మకొండ శ్రీదేవి థియేటర్లో ఈనెల 28న ఉదయం ఆటను కలెక్టరమ్మ చూసేందుకు సిద్దం అవుతున్నారు. ఆమ్రాపాలి మాదిరిగా ఇంకా కొన్ని కోట్ల మంది కూడా మొదటి రోజు సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు.