దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ క్రేజ్ ఏ స్థాయిలో మారు మ్రోగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘బాహుబలి 2’ టికెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలి ఏకంగా అయిదు వందల టికెట్లు బుక్ చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. దేశంలోని అతి చిన్న వయస్సు ఉన్న కలెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రాపాలి తాజాగా ‘బాహుబలి 2’ టికెట్లు బుక్ ఒక్కసారి ఏకంగా 500 బుక్ చేయించుకుని మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
స్వతహాగా ఆమ్రాపాలి ప్రభాస్ అభిమాని అవ్వడంతో పాటు ‘బాహుబలి’ మొదటి పార్ట్ ఆమెకు విపరీతంగా నచ్చిందట. దాంతో ఆమె ఇప్పుడు రెండవ పార్ట్ను మొదటి రోజే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తనతో పాటు మిత్రులు, బంధువులు, తోటి ఆఫీసర్స్ అందరికి కూడా టికెట్లు తీసుకున్నారు. హన్మకొండ శ్రీదేవి థియేటర్లో ఈనెల 28న ఉదయం ఆటను కలెక్టరమ్మ చూసేందుకు సిద్దం అవుతున్నారు. ఆమ్రాపాలి మాదిరిగా ఇంకా కొన్ని కోట్ల మంది కూడా మొదటి రోజు సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నారు.