బాక్సాఫీసు దగ్గర బాద్షా దూకుడు కొనసాగుతోంది. శుక్ర, శని, ఆదివారం… హల్ చల్ చేసిన బాద్షా సోమవారం నుంచి డల్ అయ్యాడు. బాద్షా థియేటర్ల వద్ద ప్రేక్షకులు పలచన పడ్డారు. అయితే… బుధవారం నుంచి మళ్లీ బాద్షా జోరు పెరిగింది. ఉగాది రోజున మార్నింగ్ షో, మాట్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. సెలవలు రావడం, మరో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులకు బాద్షానే దిక్కయ్యాడు. ఉగాది రోజున వచ్చిన…. జైశ్రీరామ్కి అన్నో ఇన్నో టికెట్లు తెగుతున్నాయి. డబ్బింగ్ బొమ్మ క్రేజీ, నవదీప్ సినిమా వసూల్ రాజాకి వైపు జనాలు వెళ్లడం లేదు. ఉగాది రోజున సరే.. ఆ తరవాత కూడా బాద్షా ఇదే జోరు కొనసాగిస్తాడా లేదా? అనేది మాత్రం తేలాల్సివుంది.