హాస్యనటులు మెగాఫోన్ పట్టుకోవడం చూస్తేనే ఉన్నాం. తనికెళ్లభరణి, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ వీళ్లంతా దర్శకులుగా మారినవారే. అయితే హాస్యనటులుగా అపారమైన అనుభవం సంపాదించిన తరవాతే మెగాఫోన్ పట్టారు. ఇప్పుడు ఈ బాటలో యువ హాస్యనటులూ అడుగులు వేస్తున్నారు. వెన్నెల కిషోర్ ఎప్పుడో దర్శకుడు అయిపోయాడు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. అష్టాచమ్మాతో ఈ నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. ఈమధ్య అంతకు ముందు – ఆ తరవాత సినిమాలోనూ బాగానే నవ్వించాడు. ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఈగ సినిమా తెరకెక్కించిన వారాహి చలన చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి అవసరాల దర్శకుడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. తెలుగు చిత్రసీమలో హాస్యనటులకు కొదవ లేదు. కానీ ఎంతమందొచ్చినా తక్కువే. ఇప్పుడిప్పుడే కమెడియన్గా స్థిరపడుతున్న దశలో దర్శకుడిగా మారాల్సిన అవసరం.. అవసరాలకు ఎందుకొచ్చిందో…?