’ఎవడు’ తో నాగచైతన్య వచ్చేస్తున్నాడు.. !!

autonagar suryaరామ్ చరణ్ ’ఎవడు’ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి12) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ’ఎవడు’ తో నాగచైతన్య కూడా వచ్చేస్తున్నాడు. అదేనండీ.. ’ఎవడు’ ఇంటర్వెల్ సమయంలో.. నాగచైతన్య ’ఆటోనగర్ సూర్య’ ట్రైలర్ ని ప్రదర్శిస్తారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు దేవాకట్ట తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే, క్యూబ్ సిస్టమ్ లో అప్ లోడ్ చేయలేకపోయామని తెలిపాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. అనూప్ రూబెస్ సంగీతాన్ని అందించాడు. ఆర్. ఆర్ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ఆర్.ఆర్ వెంకట్ నిర్మిస్తున్నారు. మెగా అభిమానులకు బంపర్ ఆఫరే..  మరీ. ఒకే టికెట్ తో రెండు సినిమాలు చూడొచ్చన్నమాట.