పైసా – ఆటోనగర్ సూర్య రెండు సినిమాల కథ ఒక్కటే. రెండూ… డబ్బుల్లేక ఆగిపోయాయి. రెండింటికీ నిర్మాత ఒక్కరే. ఇప్పుడు విచిత్రంగా రెండూ ఒకే రోజు విడుదల తేదీ ప్రకటించుకొన్నాయి. అయితే అందులో ఇప్పుడు ఒక్క సినిమానే వస్తోంది. ఈ రెండూ ఫిబ్రవరి 7న విడుదల కావాల్సివుంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక్క ‘పైసా’ మాత్రమే విడుదల అవుతోంది. ‘ఆటోనగర్ సూర్య’ ఈనెలాఖరున విడుదల చేస్తారట. ఆర్థిక సమస్యలు అలానే ఉండిపోవడంతో ఈసారీ ‘ఆటో’కి మోక్షం దక్కలేదు. అసలు ఈ సినిమాని పట్టించుకోవడం మానేసిన నాగచైతన్య, నాగార్జునలు వారి వారి సినిమాల హడావుడిలో పడిపోయారు. పాపం.. ఆటో..!