తడాఖా, మనం సినిమాలతో జోరుమీదున్నాడు నాగచైతన్య. అయితే ఒక్కటే బెంగ. ఆటోగనర్ సూర్య విడుదల కావడం లేదని. ఇప్పుడా బెంగ తీరబోతోంది. ఔను.. ఆటోనగర్ సూర్య విడుదలకు మోక్షం వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడానికి చిత్రబృందం భారీ కసరత్తులు చేస్తోంది. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ . దేవాకట్టా దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం అని వార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. స్వయంగా నాగార్జున పూనుకొన్నా… ఈ సినిమా విడుదల కాలేదు. దాంతో ఆయన కూడా లైట్ తీసుకొన్నారు. ఈ సినిమాపై అందరూ ఆశలు వదులుకొంటున్న తరుణంలో రిలీజ్కు ఆటంకాలు తొలగిపోవడం ప్రారంభించాయి. మనం సినిమా హిట్టుతో చైతన్య సినిమాపై క్రేజ్ పెరిగింది. దాంతో పంపిణీదారులు, ఫైనాన్సియర్స్, చిత్ర నిర్మాతలు ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. సరస్పర అవగాహనతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారమ్. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చు