క‌లెక్షన్ల సునామీ కొన‌సాగుతోంది!

pavanరికార్డుల జాతర కొన‌సాగుతోంది. ప‌వ‌న్ ఒకొక్క రికార్డును బ‌ద్దలు కొట్టుకొంటూ సునామీలా దూసుకుపోతున్నాడు. అత్తారింటికి దారేది తొలి మూడు రోజుల్లో ఏకంగా రూ24 కోట్లు వ‌సూలు చేసింది. ఇది మ‌న రాష్ట్రం వ‌సూళ్లు మాత్రమే. ఓవ‌ర్సీస్ లెక్కలు ఇంకా తేలాల్సివుంది. వాటితో పాటు మిగ‌తా రాష్ట్ర్రాల వ‌సూళ్లు క‌లుపుకొంటే దాదాపు రూ.28 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇది టాలీవుడ్‌ ఇండ్ర‌స్ట్రీ రికార్డ్‌. సోమ‌వారం నుంచి కుటుంబ ప్రేక్షకులు థియేట‌ర్లకు వ‌స్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌న్స్ మోర్ అంటూ థియేట‌ర్ వైపు అడుగులు వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో నూ థియేట‌ర్లు నిండడ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. మ‌రి ఈ సినిమా ఎంత వ‌సూలు చేస్తుందో, ఇంకెన్ని రికార్డుల‌ను బ‌ద్దలు కొడుతుందో..??