ఎవడు ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ని చూద్దామనుకొని భంగపడ్డారు పవన్ ఫ్యాన్స్! సరేలే – అత్తారింటికి దారేది ఉంది కదా? అనుకొన్నారు. ఈనెల 14న ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో పవన్ని కళ్లారా చూద్దామనుకొంటున్నారు. అయితే పవన్ ఈ ఆడియో వేడుక నిర్వహించడానికి సముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈమధ్య పాటల వేడుకలన్నీ గందరగోళంగా జరుగుతుండడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర ఇబ్బందికి లోనవ్వడం పవన్కి నచ్చడం లేదు. పైగా ఇలాంటి హంగామాకు దూరంగా ఉండాలనుకొంటాడు. మొహమాటం కొద్దీ… జల్సా నుంచీ ఆడియో వేడుకల్లో హాజరు కావడం అలవాటు చేసుకొన్నాడు.
అయితే ఇక మీదట అదీ వద్దు… అని తీర్మాణించుకొన్నాడట. అత్తారింటి దారేది పాటల్ని సైలెంట్గా విడుదల చేస్తే బాగుంటుందనేది పవన్ ఆలోచన. అయితే ఈ పిడుగలాంటి వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే. అసలే బయట పవన్ని చూసే అవకాశం అప్పుడప్పుడు మాత్రమే వస్తోంది. అది కూడా పుల్స్టాప్ పోయేసరికి ఇక పవన్ని చూసే దారేది? అంటూ నిరుత్సాహపడిపోతున్నారు. పవన్ తన నిర్ణయం మార్చుకొంటే బాగుంటుంది.. అని లక్షలాది ఫ్యాన్స్ కోరిక.