Site icon TeluguMirchi.com

ఆ సెగ అత్తారింటికీ అంటుకోంది

pavanప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. అత్తారింటికి దారేది సినిమా విడుద‌ల వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. తొలుత ఈ సినిమాని ఈనెల 7 న తీసుకొద్దామ‌నుకొన్నారు. సీమాంధ్ర సెగ వ‌ల్ల రెండు రోజులు ఆల‌స్యంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణయించుకొన్నారు. ఇంకా అక్కడ ప‌రిస్థితులు వేడి వేడిగానే ఉండ‌డంతో ఈసినిమాని మరోసారి వాయిదా వేశారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా సందిగ్థంలోనే ఉంది. ఈసారి నిర్మాత‌లు విడుద‌ల తేదీ కూడా ప్రక‌టించ‌లేదు. దీన్ని బ‌ట్టి – నిర్మాత‌ల్లో ఎంత గంద‌ర‌గోళం ఉందో అర్థం అవుతోంది. సీమాంధ్రలో వాతావ‌ర‌ణం చ‌క్కబ‌డే వ‌ర‌కూ పెద్ద సినిమాలేవీ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాల్లేవు. ఎందుకంటే ఆంధ్రా, సీడెడ్ మార్కెట్‌లు అత్యధిక ఆయిదా మార్గాలు. అక్కడ ప్రశాంతంగా సినిమా చూసే ప‌రిస్థితి లేదు. దానికి తోడు చిరు కుటుంబ స‌భ్యుల సినిమాల్ని విడుద‌ల చేయ‌నీయం.. అని స‌మాఖ్యాంధ్ర ఉద్యమ‌దారుల కాస్త సీరియ‌స్ గానే హెచ్చరించారు. అందుకే అత్తారింటికి.. నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.

Exit mobile version