Site icon TeluguMirchi.com

‘ సూర్య ‘ కు ఏపీ గిఫ్ట్..అభిమానులు హ్యాపీ

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేశ భక్తి నేపథ్యం లో తెరకెక్కిన ఈ మూవీ పట్ల అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలను క్యాష్ చేసుకోవాలని చిత్ర నిర్మాతలు భారీ ప్లానే చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలు వేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందారు. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల మధ్య రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రత్యేక షోలు వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో నిర్మాతలతో పాటు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందో ఇవ్వదో అని ఖంగారుపడ్డారు కానీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version