పవన్ కల్యాణ్ ప్రభంజనం కొనసాగుతోంది. అత్తారింటికి దారేది సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. విదేశాల్లో ఈ చిత్రానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. అక్కడ ఇప్పటికే రూ.22 కోట్లు వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. పవన్ కల్యాణ్కి ముందు నుంచీ ఓవర్సీస్ లో పట్టుంది. గబ్బర్ సింగ్తో అది తారాస్థాయికి చేరింది. అందుకే ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాకి కనక వర్షం కురుస్తోంది. ఓ దక్షిణాది చిత్రం విదేశాల్లో ఇన్ని వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. కొన్నికేంద్రాల్లో షారుఖ్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ వసూళ్లను కూడా పవన్ సినిమా అధిగమించింది. మరి ఈ రికార్డ్ను కొట్టే సామర్థ్యం ఎవరికి ఉందో.? బహుశా మహేష్ సినిమా 1 వల్లే అది సాధ్యమేమో..?