ఎవడు ప్రమోషన్ ఊపందుకొంది. జనవరి 1న టీజర్ విడుదల చేశారు. రేపు (శుక్రవారం) సరికొత్త ట్రైటర్ రానుంది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఎవడు ట్రైలర్ విడుదల చేయనున్నారు. దీనికి రామ్చరణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ వారంలోనే ఆడియో సక్సెస్మీట్ పెట్టాలని, చిత్రబృందం చేత మళ్లీ ఇంటర్వ్యూలు ఇప్పించాలని దిల్ రాజు భావిస్తున్నాడని టాక్. ఎవడు నుంచి పోటీ తట్టుకోవాలంటే ఈ మాత్రం హంగామా చేయాల్సిందే. జనవరి 12న ఎవడు విడుదల కానుంది.