అది మరచిపోయే లోపే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను తప్పించి ఆ ప్లేస్ లో యువ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోబోతున్నారట.. ఆల్రెడీ దేవి – శ్రీను వైట్ల కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి. అదే విధంగా రామ్ చరణ్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ‘ఎవడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక చిత్ర ప్రారంభం నుండి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు అని ప్రకటన చేసిన చిత్ర యూనిట్ సడన్ గా ఇప్పుడు దేవి ని తీసుకోవడం ఫై చాల రూమర్స్ వినపడుతున్నాయి. ఏది ఏమయినా దేవి ని తీసుకుని చిత్ర యూనిట్ మంచి పని చేసిందని మెగా అబిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేస్తునట్లు ప్రకటన కూడా విడుదల చేసారు.