ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూతన చిత్రం ‘ఆంధ్రాపోరి’. రమేష్ ప్రసాద్ నిర్మాత. రాజ్ మాదిరాజు దర్శకుడు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. సంగీతం: డా.జె., ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.