జబర్ధస్త్ ద్వారా యాంకర్గా పరిచయం అయిన అమ్మడు అనసూయ..అంతకు ముందు కూడా న్యూస్ యాంకర్గా చేసిన ఈ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ ప్రస్తుతం ‘మా మహాలక్ష్మి’ పోగ్రాం చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్ చేస్తున్న ఈ షో కోసం అమ్మడు 4 కోట్ల నగలు ధరించనుంది. దీనితో అందరి దృష్టి దీనిపైనే ఉంది. అనసూయ ఎలాంటి నగలను ధరించింది..అవి ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు అమె అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నగలను ఎంతో సెక్యూరిటీతో ‘కీర్తిలాల్ జ్యుయలర్స్’వారు కర్టసిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అనసూయ రక రకాలైన డ్రస్సులతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అదే విధంగా విజయవాడ, గుంటూరు తదితర పట్టణాలలో నిర్వహించిన ‘మా మహాలక్ష్మి’ ఎంట్రన్స్ పోటీలో ఎన్నో వేల మంది మహాలక్ష్ములు పాల్గ్గోన్నారు. ఇంకా ఈ షోలో రేలంగి గారి మనవడు లడ్డూ బాబు కూడా మహిళలను, చిన్నారుల విపరీతంగా ఆకర్షిస్తున్నాడట. హాట్ యాంకర్ కదా 4కోట్ల నగలు ఓ లెక్క కాదు కదా అనుకుంటున్నారు.