హట్ యాంకర్ అనసూయ తొలిసారిగా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఫై జబర్దస్త్ చేయనున్న సంగతి తెలిసిన విషయమే. రవికాంత్ దర్శకత్వంలో,పి.వి.పి బ్యానర్ లో రూపొందే ఈ సినిమా కు ‘క్షణం’ అనే టైటిల్ పెట్టారు.
ఈ చిత్రం లో అడవి శేష్ హీరోగా చేయనున్నాడు. పీవీపీ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొత్త అనసూయను చూస్తారంటూ చెప్పిన ఈ హాట్ భామ, తాజాగా హెయిర్ స్టయిల్ మార్చి తన రూపురేఖల్ని మార్చేసుకుంది. ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికం తీసుకుందని ఫిలిం నగర్ లో గాసిప్ వినపడుతుంది.