Site icon TeluguMirchi.com

‘కథనం’ ట్రైలర్‌ టాక్‌

అనసూయ ప్రధాన పాత్రలో నాదెండ్ల రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కథనం’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న మన్మధుడు 2 చిత్రంతో కథనం చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కథనం చిత్రంపై నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. కాని తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తప్పకుండా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

‘కథనం’ చిత్రంలో అనసూయ ఒక సినీ దర్శకురాలిగా, రచయితగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రంలో అనసూయ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుంది. యాక్షన్‌ సీన్స్‌ను కూడా అనసూయ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు ఇది మరో మంచి పాత్రగా నిలుస్తుంది. కమర్షియల్‌గా ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మన్మధుడు 2 చిత్రం పోటీని ఈ చిత్రం తట్టుకునేట్లుగానే కనిపిస్తుంది. మరి అనసూయకు ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని దక్కించి పెడుతుందో చూడాలి.

Exit mobile version