జబర్దస్త్ కామెడి షో తో బుల్లి తెరకు పరిచయం అయిన హట్ యాంకర్ అనసూయ. ఇప్పుడు తొలిసారిగా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఫై జబర్దస్త్ చేయనుందట. ఇంతకాలం నేను అలాంటివి చేయను అని మీడియా తో కబుర్లు చెప్పిన ఈ భామ ఇప్పుడు అడవి శేష్ తో రొమాన్స్ చేయడానికి సిద్దం అయ్యింది. రవికాంత్ దర్శకత్వంలో,పి.వి.పి బ్యానర్ లో రూపొందే సినిమాలో నటించడానికి అంగీకరించింది అనసూయ. ఈ విషయాన్ని తనే ప్రకటన చేసింది. ‘‘స్క్రిప్టు వినగానే నో చెప్పలేకపోయాను. అంతలా నా పాత్ర డిజైన్ చేశారు. అందుకే, వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ సినిమా ద్వారా మీరు కొత్త అనసూయను చూస్తారు’’ అంటోంది. జబర్దస్త్ తో కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ అబిమానుల మనసులు కూడా దోచుకోబోతుంది అన్నమాట. అన్నట్టుగానే దీని కోసం పూర్తిగా మేకోవర్ అవుతోంది. ముందుగా హెయిర్ స్టయిల్ మార్చుకుంది. ఇప్పుడు బరువు తగ్గే పనిలో కూడా నిమగ్నమైంది అనసూయ.